బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై కీలక నిర్ణయం.. భారత ఏజెన్సీలకు నేరుగా సమాచారం ఇవ్వనున్న Meta
భారత ఎగుమతులకు భారీ జోష్.. ఆగస్టులో 26 శాతం వృద్ధి
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా హౌస్‌లో కీలక పరిణామం
బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 26వ రోజూ భారీ వసూళ్లు
AP TODAY / ఉరవకొండలో ఆగని పందుల స్వైరవిహారం
ఉరవకొండలో ఆగని పందుల స్వైరవిహారం
AP TODAY
AP TODAY

September 4, 2026

ఉరవకొండ రూరల్ (aptoday)  : పట్టణంలోని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ,  ప్రాంతాల్లో పందుల స్వైరవిహారం రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పక్కన, మురుగు కాలువల వద్ద, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పల్లో పందులు గుంపులుగా సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో పందులు ప్రధాన రహదారులపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగించే వేళ భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పందులు వాహనాలకు అడ్డుగా రావడంతో ప్రమాదాలు తృటిలో తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.

కాలనీల్లో చెత్తను సకాలంలో తొలగించకపోవడం, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో పందుల సంఖ్య పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దోమలు, ఈగలు అధికమై డెంగీ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు చేపట్టి పందుల సంచారాన్ని అరికట్టడంతో పాటు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, ఇందిరానగర్ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement