బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై కీలక నిర్ణయం.. భారత ఏజెన్సీలకు నేరుగా సమాచారం ఇవ్వనున్న Meta
భారత ఎగుమతులకు భారీ జోష్.. ఆగస్టులో 26 శాతం వృద్ధి
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా హౌస్‌లో కీలక పరిణామం
బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 26వ రోజూ భారీ వసూళ్లు
AP TODAY / ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
AP TODAY
AP TODAY

2 hours ago

నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ దిశగా నెల్లూరు నగరంలో మరో ముందడుగు పడింది.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసిన రెండు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం పాఠశాలలను ఆయన స్వయంగా పరిశీలించారు.

పాఠశాల ప్రాంగణంలో కలియతిరిగిన మంత్రి.. తరగతి గదులు, ప్రయోగశాల, డైనింగ్ హాల్‌తో పాటు విద్యార్థులకు అందుతున్న ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చట

పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో మాట్లాడారు. వారి చదువులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. కష్టపడి చదివి భవిష్యత్తులో తమ లక్ష్యాలను సాధించాలని వారికి ప్రోత్సాహం అందించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

నెల్లూరులో సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన పాఠశాలల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement