మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఉరవకొండలో ఆగని పందుల స్వైరవిహారం
ఉరవకొండలో ఆగని పందుల స్వైరవిహారం
AP TODAY
AP TODAY

September 4, 2026

ఉరవకొండ రూరల్ (aptoday)  : పట్టణంలోని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ,  ప్రాంతాల్లో పందుల స్వైరవిహారం రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పక్కన, మురుగు కాలువల వద్ద, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పల్లో పందులు గుంపులుగా సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో పందులు ప్రధాన రహదారులపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగించే వేళ భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పందులు వాహనాలకు అడ్డుగా రావడంతో ప్రమాదాలు తృటిలో తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.

కాలనీల్లో చెత్తను సకాలంలో తొలగించకపోవడం, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో పందుల సంఖ్య పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దోమలు, ఈగలు అధికమై డెంగీ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు చేపట్టి పందుల సంచారాన్ని అరికట్టడంతో పాటు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, ఇందిరానగర్ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement