అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో మొత్తం 10,060 ప్రభుత్వ ఖాళీలను నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే రెండో దశ నియామక ప్రక్రియను సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నోటిఫికేషన్లు విడుదల చేసే ముందు పోస్టుల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానం తదితర అంశాలను సంబంధిత శాఖలు ఖరారు చేయనున్నాయి.
ఉద్యోగార్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే పోస్టుల వారీగా అర్హతలు, దరఖాస్తు తేదీలు, పరీక్ష వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.