అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగవంతమవుతున్నాయి. రాష్ట్రంలోని 59 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన తుది పోలింగ్ స్టేషన్ల జాబితాలను అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాలను సెప్టెంబర్ 10న విడుదల చేసి ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు.
వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 13న తుది జాబితాలను సంబంధిత కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో కూడా కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై రాజకీయ పార్టీల్లో చర్చలు కొనసాగుతున్నాయి.