మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఏపీలో ఆలయాలకు పెరిగిన భక్తుల రద్దీ.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఆలయాలకు పెరిగిన భక్తుల రద్దీ.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
AP TODAY
AP TODAY

20 hours ago

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలకు భక్తుల రాక ఇటీవల గణనీయంగా పెరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

వినాయక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవలి కాలంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, భద్రతా చర్యలు పెంచడం వల్ల భక్తుల రద్దీ పెరిగిందని మంత్రి తెలిపారు.

గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మరిన్ని ఆలయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. అనేక ఆలయాల్లో నిత్య నైవేద్యం, అన్నదానం వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని తెలిపారు.

తిరుమల, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా రాష్ట్రంలోని దేవాలయాలకు మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement