మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కొత్తపేట అభివృద్ధికి రూ.22.64 కోట్లు.. 41 పనులకు నిధులు మంజూరు
కొత్తపేట అభివృద్ధికి రూ.22.64 కోట్లు.. 41 పనులకు నిధులు మంజూరు
AP TODAY
AP TODAY

5 days ago

కొత్తపేట అభివృద్ధికి రూ.22.64 కోట్లు.. 41 పనులకు గ్రీన్ సిగ్నల్

రహదారులు, పుష్కర ఘాట్ల అభివృద్ధికి పెద్దపీట

కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

కొత్తపేట, సెప్టెంబర్ 10: కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం మొత్తం రూ.22.64 కోట్లతో 41 పనులు చేపట్టనున్నట్లు గురువారం వెల్లడించారు.

రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా రహదారులు, పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మూడు ప్రభుత్వ శాఖల ద్వారా ఈ పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.11.90 కోట్లు

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో స్టేట్ హైవేలు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లకు సంబంధించి మూడు పనులకు రూ.11.90 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

  • కొత్తపేట బోడిపాలెం వంతెన నుంచి వానపల్లి శివారు రాయుడుపాలెం వరకు రహదారి బలోపేతానికి రూ.5.65 కోట్లు

  • ఉచ్చిలి–బొబ్బర్లంక రహదారి నిర్మాణానికి రూ.5 కోట్లు

  • ఊబలంక పంచాయతీ పార్క్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు రహదారి మరమ్మతులకు రూ.1.25 కోట్లు

కేటాయించినట్లు సత్యానందరావు వెల్లడించారు.

పంచాయతీరాజ్ శాఖలో 7 పనులు

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పుష్కరాలకు సంబంధించిన 7 రహదారి అభివృద్ధి పనులకు రూ.3.96 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.

జొన్నాడ, బడుగువానిలంక, మెర్లపాలెం, పేరవరం, వాడపల్లి, కొమరాజులంక తదితర గ్రామాల్లో పుష్కర ఘాట్లకు చేరుకునే సీసీ రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, అనుసంధాన రహదారులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

31 పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.6.78 కోట్లు

నీటిపారుదల శాఖ పరిధిలో 31 పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు రూ.6.78 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

వశిష్ట, గౌతమి నదుల ఎడమ, కుడి గట్ల వెంబడి రాజవరం, వెలిచేరు, వసంతవాడ, కట్టుంగ, నార్కేడిమిల్లి, అంకంపాలెం, జుత్తుగపాడు, గోపాలపురం, గంటి, బడుగువానిలంక, జొన్నాడ, ఆలమూరు, పేరవరం, వద్దిపర్రు, ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి, ఊబలంక, కొమరాజులంక, కొత్తపేట, వానపల్లి, వాడపాలెం, రావులపాలెం తదితర గ్రామాల పరిధిలో పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమైన ఘాట్‌ పనులు

  • జొన్నాడ: గౌతమీ ఎడమ గట్టుపై ఉన్న పుష్కర ఘాట్‌ను 21 మీటర్ల పొడవున ఏకీకృతం చేసేందుకు రూ.1.38 కోట్లు

  • వాడపల్లి: 24 మీటర్ల పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.45 లక్షలు

  • గోపాలపురం: 10 మీటర్ల ఘాట్ అభివృద్ధికి రూ.24.99 లక్షలు

  • ఊబలంక: 8 మీటర్ల ఘాట్ అభివృద్ధికి రూ.37.40 లక్షలు

కేటాయించినట్లు ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.

41 పనులకు రూ.22.64 కోట్ల నిధులు

కొత్తపేట నియోజకవర్గంలో రహదారులు, పుష్కర రోడ్లు, ఘాట్ల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో మొత్తం 41 అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.11.90 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.3.96 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.6.78 కోట్లు కేటాయించగా.. మొత్తంగా రూ.22.64 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

రానున్న పుష్కరాల నేపథ్యంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు భక్తులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement