విశాఖపట్నం: నగర ప్రజలకు ఆధునిక కంటి సంరక్షణ సేవలను అందించే దిశగా మరో కొత్త కేంద్రం అందుబాటులోకి వచ్చింది. SpecsBunker ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ZEISS VISION CENTER ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్లో SpecsBunker ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆరవ ZEISS VISION CENTER ఇదేనని, విశాఖపట్నంలో మాత్రం ఇదే తొలి కేంద్రంగా సంస్థ తెలిపింది. నగరంలోని Inorbit Mallలో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.
ఆధునిక విజన్ చెకప్లు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కంటి సంరక్షణ సలహాలు, కళ్లద్దాల లెన్స్ సంబంధిత సేవలను ఒకే చోట అందించడమే కేంద్రం లక్ష్యంగా పేర్కొంది.
ZEISS ప్రపంచవ్యాప్తంగా విజన్ కేర్ రంగంలో పనిచేస్తున్న సంస్థ. ZEISS సమాచారం ప్రకారం ప్రపంచంలోని సుమారు 50 దేశాల్లో 400కు పైగా ZEISS VISION CENTERలు ఉన్నాయి.
విశాఖ నగరంలో పెరుగుతున్న ప్రీమియం రిటైల్, హెల్త్కేర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది.