కృష్ణాజిల్లా, గుడివాడలో చిట్టీల ముసుగులో ప్రజలకు టోకరా వేసిన వారిపై పోలీసుల చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకార సంఘం నేత మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు రేవంత్ సాయిపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు, వారింట్లో సోదాలు చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. 32 మంది బాధితుల నుంచి 51 లక్షల 79 వేల మొత్తానికి చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసినట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు కోసం గాలింపు చేపట్టారు.
కాగా జులై 31న ఫిర్యాదు చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారంటూ బాదితులు ఆరోపిస్తున్నారు. 38.60 లక్షలకు ఐపీ నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు విమర్శించారు.