మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / మాధురి రాథోడ్ ఫిర్యాదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఈశ్వర్ సాయి
మాధురి రాథోడ్ ఫిర్యాదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఈశ్వర్ సాయి
AP TODAY
AP TODAY

September 1, 2026

హైదరాబాద్: ఫోక్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన Crime No.1559/2026 కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

ఈశ్వర్ సాయి తరఫున హైకోర్టు న్యాయవాది నాగూర్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో BNS సెక్షన్ 69 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

FIRలోని వివరాల ప్రకారం.. ఈశ్వర్ సాయి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధాలు కొనసాగించారని, అనంతరం వివాహానికి నిరాకరించారని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఫిర్యాదులో పేర్కొన్న మరో అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈశ్వర్ సాయి ఇప్పటికే వివాహితుడని, తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివాహితుడైన వ్యక్తి భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీకి సంబంధించిన ఆరోపణలను కోర్టు ఏ విధంగా పరిశీలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈశ్వర్ సాయి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు, కోర్టు తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

గమనిక: కేసులోని ఆరోపణలు కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది. తుది న్యాయ నిర్ణయం వెలువడే వరకు ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించరాదు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement