మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / హిమాలయాల్లో భారీ హిమానీనదం కూలి ప్రళయం.. డ్రోన్ కెమెరాలో భయానక దృశ్యాలు!
హిమాలయాల్లో భారీ హిమానీనదం కూలి ప్రళయం.. డ్రోన్ కెమెరాలో భయానక దృశ్యాలు!
AP TODAY
AP TODAY

August 31, 2026

హిమాలయ పర్వతశ్రేణుల్లో భారీ హిమానీనదం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద మంచు, రాళ్లతో కూడిన పర్వత భాగం ఒక్కసారిగా విరిగిపడిన దృశ్యాలను డ్రోన్ కెమెరా రికార్డ్ చేసింది.

చైనాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ సుమారు 7,200 మీటర్ల ఎత్తు నుంచి ఈ విపత్తును చిత్రీకరించారు. భారీ మంచు ఫలకం, దాని కింద ఉన్న రాతి పొరలు ఒక్కసారిగా కూలిపడటం.. ఆ తర్వాత దట్టమైన ధూళి మేఘాలు పైకి లేవడం వీడియోలో కనిపిస్తోంది.

కూలిన పర్వత భాగం సుమారు 1,200 మీటర్ల దిగువన ఉన్న లోయలో పడటంతో మంచు, రాళ్లు, బురదతో కూడిన భారీ ఉప్పెన ఏర్పడింది.

ఈ ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఆగస్టు 26న భోటేకోశి, త్రిశూలి నదుల్లో తీవ్ర వరదలకు దారితీశాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.

వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో అత్యధికులు నేపాల్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు.

ఈ విపత్తుపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఊహకందనిదిగా, హృదయ విదారకంగా ఉందని పేర్కొన్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా నష్టాన్ని అంచనా వేయడం సవాలుగా మారిందని తెలిపారు.

మరోవైపు శాటిలైట్ చిత్రాలు, భూకంప డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. లాంగ్‌టాంగ్ లిరుంగ్ ఉత్తర భాగంలో భారీగా మంచు, రాళ్లు విరిగిపడటమే వరదలకు ప్రధాన కారణమని నిర్ధారించారు.

హిమానీనదం కూలిన సమయంలో భూకంప లేఖినిపై 5.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించారు.

హిమాలయాల్లో ఇలాంటి విపత్తులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో అస్థిరంగా ఉన్న మంచు, రాళ్ల కారణంగా మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

<p lang="en" dir="ltr">A Chinese photographer accidentally captured the catastrophic avalanche on Mount Lamtang in Nepal during a drone shoot.<br><br>[📹 HeyMu. Travel] <a href="https://t.co/rgWylkezSC">pic.twitter.com/rgWylkezSC</a></p>&mdash; Massimo (@Rainmaker1973) <a href="https://x.com/Rainmaker1973/status/2093248042061242699?ref_src=twsrc%5Etfw">August 28, 2026</a>

<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement