మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికులకు షాక్.. ప్రత్యేక బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీలు
రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికులకు షాక్.. ప్రత్యేక బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీలు
AP TODAY
AP TODAY

August 28, 2026

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే, ఈ ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ ఛార్జీల కంటే అధికంగా టికెట్ ధరలు వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎంజీబీఎస్ నుంచి జడ్చర్లకు సాధారణ ఛార్జీ రూ.150 ఉండగా ప్రత్యేక బస్సుల్లో రూ.190, కరీంనగర్‌కు సూపర్ డీలక్స్ బస్సులో రూ.300 ఉండే టికెట్ ప్రస్తుతం రూ.400గా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు.

ముందస్తు సమాచారం లేకుండా ధరలు పెంచడంపై పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లాల్సిన సామాన్యులకు అదనపు ఛార్జీలు భారంగా మారాయని వారు వాపోతున్నారు.

అయితే, పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 1.5 రెట్లు వరకు అధికంగా వసూలు చేసే వెసులుబాటు 1981 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంస్థకు ఉందని టీజీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో ప్రసన్న వివరణ ఇచ్చారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement