మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఉరవకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు మృతి
ఉరవకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు మృతి
AP TODAY
AP TODAY

4 days ago

ఉరవకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు మృతి

అనంతపురం జిల్లా: ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు ఓ కేసు విషయంలో రాజీ (కాంప్రమైజ్) కోసం వచ్చిన ముగ్గురు స్నేహితులు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన గురువారం రాత్రి గుత్తకల్లు ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వజ్రకరూరు ప్రాంతానికి చెందిన జైనుల్లా (44), మహబూబ్ బాషా (33), మహ్మద్ రఫీ (29) ముగ్గురు స్నేహితులు ఓ కేసు విషయంలో రాజీ కోసం గురువారం ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీస్ స్టేషన్‌లో పని ముగించుకుని రాత్రి సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలో వారు గుత్తకల్లు ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు స్నేహితులు ఒకేసారి మృతి చెందడంతో వజ్రకరూరు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement